మాజీ సీఎం జగన్కు మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్
ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే మంత్రి సత్య కుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ కు సంచలన సవాల్ విసిరారు.
దిశ, వెబ్ డెస్క్: ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే మంత్రి సత్య కుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ కు సంచలన సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. దీనిపై జగన్ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అలాగే మెడికల్ కాలేజీల్లో జరిగిన అవినీతిని తాను ఆధారాలతో సహా నిరూపిస్తానని.. నిరూపించలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల ఏర్పాటులో.. విచ్చలవిడిగా అవినీతి జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.