జగన్ ఢిల్లీ వెళ్లింది అందుకోసమే.. సీక్రెట్ రివీల్ చేసిన మంత్రి పయ్యావుల

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఢిల్లీ ధర్నాపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

Update: 2024-07-26 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఢిల్లీ ధర్నాపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలతో చర్చల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఇండియా కూటమిలో చేరేందుకు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని.. కానీ జగన్‌కు ప్రతిపక్ష హోదా రావడానికి కూడా మరో పదేళ్ల సమయం పడుతోందని సెటైర్ వేశారు.

ఢిల్లీ వెళ్లి జగన్ చెబుతోన్న అంశాలు అసెంబ్లీకి వచ్చి చెప్పాలని.. అంతేకానీ అసెంబ్లీకి వెళ్లి ఢిల్లీ రాష్ట్రం గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో అభిమానించే వారు, అవమానించే వారు ఉండటం సహజమని హితవు పలికారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే మన రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువ ఉంటే.. మరీ ఎక్సైజ్‌పై వచ్చిన ఆదాయం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాగా, ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే.


Similar News