Minister Nimmala: ఏం చేయాలో సీఎం చంద్రబాబుకు తెలుసు

వదర పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Update: 2024-09-02 12:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: వదర పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సోమవారం మంత్రి నిమ్మల కృష్ణా జిల్లా కరకట్టలోని మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యశాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాలే ఈ విపత్కర పరిస్థితులకు కారణమని అన్నారు. గత ప్రభుత్వం బుడమేరు లైనింగ్ పనులు కూడా చేయలేదు అని అసహనం వ్యక్తం చేశారు. బుడమేరుకు మూడుచోట్ల గండ్లు పడ్డాయని అన్నారు. ప్రస్తుతం మరమ్మత్తులు చేస్తున్నట్లు తెలిపారు. వరద ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయక చర్యలు అందిస్తున్నట్లు చెప్పారు. సంక్షోభ సమయంలో ఎలా పనిచేయాలో సీఎం చంద్రబాబుకు తెలుసని.. ప్రజలను ఆదుకోవడమే మా ముందున్న లక్ష్యం అని అన్నారు. వైసీపీ నేతల విమర్శలు పట్టించుకునే సమయం మాకు లేదని విమర్శించారు.


Similar News