రాజధాని నిర్మాణం.. ఇక చకచకా..!

వీలైనంత త్వరగా అమరావతి ప్రాజెక్ట్‌ పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరి నారాయణ అన్నారు...

Update: 2024-07-23 06:45 GMT

దిశ, డైనమిక్‌ బ్యూరో: వీలైనంత త్వరగా అమరావతి ప్రాజెక్ట్‌ పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరి నారాయణ అన్నారు. మంగళవారం ఉదయం ఆయన స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ను కలిసి వెంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్‌, ఈ-హెల్త్‌ సెంటర్‌, మందడంలో నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడి భవనాన్ని పరిశీలించారు. అమరావతి స్మార్ట్‌ సిటీ‌లో భాగంగా నిర్మిస్తున్న పలు భవనాలను కూడా పరిశీలన చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడంతో రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందన్నారు. శాఖలవారీగా చేసిన కేటాయింపులను కూడా ఇతర అవసరాలకు ఖర్చు పెట్టేసిందని ఆరోపించారు. మూడు ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేసిందని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం పూర్తయితే ప్రపంచంలో నెంబర్‌ వన్‌గా ఉండేదన్నారు. రాజధాని అమరావతిని పూర్తి చేయడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నారాయణ పునరుద్ఘాటించారు.

Tags:    

Similar News