Nara Lokesh:కోర్టుకు హాజ‌రైన‌ మంత్రి నారా లోకేష్.. కారణం ఏంటంటే?

ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోర్టుకు హాజరయ్యారు. ‘‘చిన‌బాబు చిరుతిండి.. 25 ల‌క్షలండి’’ పేరుతో ఓ వార్తా పత్రిలో వచ్చిన కథనంపై ఆయన ఫైట్ చేస్తున్నారు.

Update: 2024-08-29 08:53 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోర్టుకు హాజరయ్యారు. ‘‘చిన‌బాబు చిరుతిండి.. 25 ల‌క్షలండి’’ పేరుతో ఓ వార్తా పత్రిలో వచ్చిన కథనంపై ఆయన ఫైట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం విశాఖలోని 12వ అదనపు జిల్లా కోర్టుకు లోకేష్ హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం లోకేష్ విశాఖలోనే పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కొలువుదీరిన తర్వాత మొదటిసారి లోకేష్ వైజాగ్ రావడంతో అభిమానులు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. అయితే ఇంతకుముందే ఈ కథనంపై వివరణ ఇవ్వాలని మీడియా ఛానల్‌కు లోకేష్ నోటీసులు పంపించారు. దీనిపై సదరు సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో లోకేష్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.


Similar News