Nara Lokesh: ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4.0 వెర్షన్ ను చూడబోతున్నాం: మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఐటీ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-30 04:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఐటీ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏవిధంగా అభివృద్ధి చేశారో ఐటీ పరిశ్రమదారులకు తెలుసునని మరోసారి గుర్తు చేశారు. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడి ఐఎస్ బిని హైజాక్ చేసి హైదరాబాద్‌కు రప్పించారని వెల్లడించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4.0 వెర్షన్ ను చూడబోతున్నామని గర్వంగా చెప్పుకొచ్చారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని నెం.1 గా నిలిపిన సీఎం చంద్రబాబు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీయించబోతున్నారని చెప్పారు. చంద్రబాబు 1995 నాటి సీఎం మాదిరిగానే పనిచేస్తున్నారని వెల్లడించారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చుతామని అన్నారు. గత పాలన కాదని, ఇది బాబు పాలన అని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. 


Similar News