వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ వివాదంపై మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2024-08-12 16:58 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ వివాదంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బంధాలపై దువ్వాడకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆయన సూచించారు. దువ్వాడతో వైసీపీకి రాజీనామా చేయించి ఇంటికి పంపితే అటు జగన్ మోహన్ రెడ్డికి సైతం గౌరవం ఉంటుందని చెప్పారు. దువ్వాడతో రాజీనామా చేయిస్తారా.. లేదా జగనే రాజీనామా చేయిస్తాడా అని మంత్రి ఆనం ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇప్పటికే సమాధి కట్టారని ఎద్దేవా చేశారు. ఈ మధ్యకాలంలో పెద్దల సభలో ఉన్న వారే దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ ఏ ముఖం పెట్టుకుని పెద్దల సభలో సమాధానం చెబుతారని ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. 

Tags:    

Similar News