విజయవాడ వరద బాధితులకు మేఘా (MEIL) సాయం
విజయవాడలో కురిసిన కుంభవృష్టి వర్షానికి తోడు బురమేడ వాగు ఉప్పొంగింది. దీంతో నగరంలోని అనేక కాలనీలు నీటిలో మునిగిపోయాయి.
దిశ, వెబ్డెస్క్: విజయవాడలో కురిసిన కుంభవృష్టి వర్షానికి తోడు బురమేడ వాగు ఉప్పొంగింది. దీంతో నగరంలోని అనేక కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా సింగ్ నగర్ పూర్తిగా జలదిగ్బందం లోకి వెళ్ళిపోయింది. ఈ వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే రెండు సార్లు పర్యటించారు. వరద ఉధృతి నెమ్మది నెమ్మదిగా తగ్గుతుండటంతో.. సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. అలాగే వరద బాధితులకు ఆహారం అందజేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ వరద బాధితులకు మేఘా (MEIL) సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. లక్షన్నర మందికి అల్పాహారం, భోజనం, వాటర్ బాటిల్స్ పంపిణీకి మేఘా సిద్ధం అయింది. ఇందుకోసం.. హరేకృష్ణ సంస్థ సహకారం తీసుకొని ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో మేఘా సంస్థ ఆహారం పంపిణీ చేయనుంది. విజయవాడ కలెక్టరేట్లో ఈ ఆహారం అందించనున్నట్లు మేఘా ఇంజినీరింగ్& ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రతినిధులు తెలిపారు.