Mega Hero:మంత్రి లోకేష్ని కలిసి విరాళం అందించిన మెగా హీరో
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) విజయవాడను వరదలు ముంచెత్తాయి. ఈ వరదలతో(Floods) ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దిశ,వెబ్డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) విజయవాడను వరదలు ముంచెత్తాయి. ఈ వరదలతో(Floods) ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి విజయవాడ(Vijayawada) నగరం వరద(Flood) గుప్పిట్లో విలవిలలాడుతోంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వరద బాధితుల(Flood Victims) కోసం ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఏపీ మంత్రి నారా లోకేష్ను(Nara Lokesh) కలిసి రూ.10 లక్షల విరాళం(donation) అందించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ను మంత్రి లోకేశ్ మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ రోజు మంత్రి నారా లోకేశ్ను చాలామంది కలిసి విరాళాలు అందించారు. సచివాలయంలోని 4వ బ్లాక్లో మంత్రి నారా లోకేశ్ను కలిసిన దాతలు చెక్కులు అందజేశారు. డిక్షన్ గ్రూప్ ( Dixon group ) తరపున రూ.1 కోటి చెక్ ను కంపెనీ ప్రతినిధులు లోకేష్కు అందించారు. నెక్కంటి సీ ఫుడ్స్ తరఫున సంస్థ ప్రతినిధులు రూ.1 కోటి విరాళం(donation) అందించారు.
Also Read: గొప్ప మనసు చాటుకున్న మెగా హీరో.. ఈ గుణం పవన్ నుంచే వచ్చిందంటున్న నెటిజన్లు