జనసేనలో భారీగా చేరికలు.. పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న వైసీపీ నేతలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నుంచి జనసేన(Janasena)లోకి భారీగా చేరికలు జరిగాయి...

Update: 2024-10-19 14:00 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నుంచి జనసేన(Janasena)లోకి భారీగా చేరికలు జరిగాయి. పలువురు నాయకులు మంగళగిరి(Mangalagiri) జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) సమక్షంలో పార్టీలో చేరారు. రాజమండ్రికి చెందిన  క్రాంతి దంపతులు, అమలాపురానికి చెందిన కల్వకొలను తాతాజీ, గుంటూరుకు చెందిన చందు సాంబశివరావు పార్టీలో చేరారు. వీరికి పవన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

 

అలాగే గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు నిమ్మల వెంకట రమణ, సంకూరి శ్రీనివాసరావు, ఇర్రి ధనలక్ష్మి, అయిశెట్టి కనకదుర్, జగ్గయ్యపేట మున్సిపాలిటి కౌన్సిలర్లు కొలగాని రాము, కాశీ అనురాధ, తుమ్మల ప్రభాకర్ రావు , కాటగాని శివ కుమారి, తన్నీరు నాగమణి , సాధుపాటి రాజా,  పాకలపాటి సుందరమ్మ, షేక్ సిరాజున్, మోరే సరస్వతి, పండుల రోశయ్య, కోఆప్షన్ మెంబర్లు చైతన్య శర్మ, ఖాదర్ బాషా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు  ఆకుల బాజీ, వీరయ్య చౌదరి, పెడన నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ జక్కా ధర్మారాయుడుతోపాటు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు, నాయకులు జనసేనలో చేరారు.


Similar News