కూటమి నేతృత్వంలోనే ఏపీ అభివృద్ధి: మహారాష్ట్ర మాజీ గవర్నర్

కూటమి ప్రభుత్వంలోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు..

Update: 2024-06-26 17:23 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. బీజేపీ నేత పివి చలపతిరావు జయంతి సందర్భంగా  ‘2024 ప్రజా తీర్పు సందేశం’ అన్న అంశంపై విశాఖ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం ఆయన స్మారక ఉపన్యాసంచేశారు. ప్రధాని మోదీ సహకారంతో అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో చాలా కసితో కూటమి నాయకులు అధికారంలోకి వచ్చారని చెప్పారు. దేశంలో కూటమికి అనుకున్న స్థానాలు రాలేదని, ఎన్నికల ఫలితాలపై సూక్ష్మ స్థాయి నుంచి చర్చించుకోవాలసిన అవసరం ఉందనిన్నారు.  ఈ ఎన్నికల ద్వారా మోదీ నేతృత్వంలో భారతదేశం మంచితనం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలు చేస్తుందని, బీజేపీ అన్యాయం చేస్తుందని అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కి ఇప్పుడు వచ్చిన సీట్లు కంటే ఎక్కువ వస్తాయని విద్యాసాగర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. 


Similar News