తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ

స్థానిక శాంతినగర్ 12వ రోడ్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీ మొత్తంలో చోరీ చేశారు.

Update: 2024-09-28 14:52 GMT

దిశ, ఏలూరు: స్థానిక శాంతినగర్ 12వ రోడ్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీ మొత్తంలో చోరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు శాంతినగర్ 12 వ రోడ్‌లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమాని కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లిన సమయంలో దొంగలు ఇంట్లో జొరబడ్డారు. ఇంటి యజమాని వచ్చే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. యజమాని ఫిర్యాదు మేరకు సుమారు 25 కాసుల బంగారు వస్తువులు, రెండు కేజీల వెండి వస్తువులు, దొంగలు దోచుకున్నారు. ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి దొంగతనాలకు పాల్పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, మూడవ పట్టణ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వివరాలు సేకరిస్తున్నారు.


Similar News