హైదరాబాద్ శివారులో భారీగా బంగారం పట్టివేత

రాయికల్ టోల్ ప్లజా వద్ద భారీగా బంగారం పట్టుపడంది.

Update: 2024-09-28 14:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాయికల్ టోల్ ప్లజా వద్ద భారీగా బంగారం పట్టుపడంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో భాగంగా.. వాహనాలకు చెక్ చేస్తుండగా దాదాపు 4.7 కిలోల బంగారం పట్టుబడినట్లు తెలుస్తుంది. కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ బంగారం విలువ 3.71 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు..నిందితులను రిమాండ్‌కు తరలించారు.


Similar News