అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయసాయి రెడ్డి చేసే దందాలు ఇవా..4కోట్లు ఎక్కడివి?: మదన్ మోహన్ ఫైర్

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి.. వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కారణంగా గర్భం దాల్చిందని మదన్ మోహల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-16 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి.. వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కారణంగా గర్భం దాల్చిందని మదన్ మోహల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కాగా నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి విజయసాయిరెడ్డి డీఎన్‌ఏ టెస్ట్‌కు రావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే మదన్ మోహన్.. ఒక వ్యక్తికి ఇవ్వటానికి విజయసాయి రెడ్డికి రూ.4 కోట్లు ఎక్కడివి ? అని గొంతెత్తి ప్రశ్నించారు. రూ.4 కోట్లు పెట్టి విల్లా కొని పెట్టేంత డబ్బు సాయిరెడ్డికి ఎక్కడిది? అని అడిగారు. ఓ బిల్డర్ నుంచి కోటి రూపాయల బ్యాగ్ తెచ్చి సాయి రెడ్డి ఇంట్లో ఎందుకు ఇచ్చాడని ఆరోపించారు. మళ్ళీ సాయిరెడ్డి సతీమణి రూ. 60 లక్షల బ్యాగ్ ఎందుకు ఇచ్చారని విరుచుకుపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయసాయి రెడ్డి చేసే దందాలు ఇవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డికి వాటాలు రాకపోతే సైలెంట్‌గా ఎందుకు ఉంటాడని అన్నారు. అసలు విజయసాయిరెడ్డిని విశాఖలో పెట్టిందే ఇలాంటి పనులకి అంటూ ఎద్దేవా చేశారు. ఆ డబ్బు ఏంటి? కోట్ల రూపాయిల సూట్ కేసులు విజయసాయి రెడ్డికి ఎక్కడ నుంచి వచ్చాయంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ మీడియా సమావేశంలో ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. 

Tags:    

Similar News