వరద నీటిలో కొట్టుకుపోయిన లైన్‌మెన్

ఏపీలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది.

Update: 2024-09-03 11:02 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. భారీ వరదల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. వివరాల్లోకి వెళితే..నగరంలోని ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరణ పనుల్లో అపశ్రుతి జరిగింది. సహాయక చర్యల్లో నిమగ్నమైన లైన్‌మెన్ వజ్రాల కోటేశ్వరరావు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ ఘటన పై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కోటేశ్వరరావు భార్య మాధవికి ఫోన్ చేసి మాట్లాడి సానుభూతి తెలిపారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.


Similar News