ఉచిత ఇసుక విధానంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో ఉచిత ఇసుక విధానంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-18 14:02 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఉచిత ఇసుక విధానంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక అవసరాలకు ఇసుక రీచ్ వద్ద నుండి ఎడ్లబండ్ల ద్వారా ఇసుక తీసుకువెళ్లేందుకు ఇదివరకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం రీచ్ ల నుంచి ట్రాక్టర్లతో కూడా ఇసుక తీసుకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.   


Similar News