నన్ను చంపేందుకు సుపారీ గ్యాంగ్ దిగింది: పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్

వారాహి యాత్రతో స్పీడ్ పెంచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార వైసీపీ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు.

Update: 2023-06-18 03:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: వారాహి యాత్రతో స్పీడ్ పెంచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార వైసీపీ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. స్ట్రీట్ మీటింగులు, పార్టీ మీటింగులు ఏదైనా సరే వైసీపీపై ఒంటి కాలిపై లేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం జనసేన నేతలతో సమావేశం నిర్వహించన పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు ప్రాణహాని ఉందని.. నన్ను చంపాడానికి కొందరికి సుపారీ ఇచ్చారని పవన్ సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని తెలిపారు. దీంతో రక్షణ కోసమే తన చుట్టూ సెక్యూరిటీ పెట్టుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీని జనసేన గద్దె దింపే దిశగా వెళ్తుంతోందని.. దీంతో అధికార పార్టీ నేతలు ఏం చేయడానికైనా తెగిస్తారన్నారని అన్నారు. అధికారం దూరం అవుతుందనే భయంతో వారు ఏం చేయడానికైనా వెనుకాడరని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ రౌడీ నాయకులను ఒక్కరిని కూడా గెలిపించొద్దని పవన్ కోరారు. కాగా, పవన్ చేసిన ప్రాణహాని కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read: శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు.. ఎమోషనల్ పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు..

Tags:    

Similar News