AP News:‘మాజీ మంత్రి రోజా అరెస్ట్ కావడం ఖాయం’..జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

ఏపీలో టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన ఫైల్స్ దగ్ధం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Update: 2024-08-18 13:51 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన ఫైల్స్ దగ్ధం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ ఘటన పై కూటమి అధికారులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై కూటమి మంత్రులు విచారణ జరిపించాలని, నిందితులు ఎవరైనా వదిలేది లేదని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఫైల్స్ దగ్ధం ఘటనలపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకే ఫైల్స్ దగ్ధం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై విజిలెన్స్ విచారణలో నిజాలు బయటకు వస్తాయనే ఫైల్స్ దగ్ధం చేశారని ఆరోపిస్తున్నారు. టీటీడీలో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు. కొందరు అధికారుల ఒత్తిడితోనే ఫైల్స్ దగ్ధం, శ్రీవాణి ట్రస్ట్ ఫైల్స్ దగ్ధం చేశారని విమర్శలు గుప్పించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల పై దృష్టి సారించింది. ఇందులో రాష్ట్ర మాజీ మంత్రి రోజా కూడా ప్రతిరోజు పదుల సంఖ్యలో టికెట్లు జారీ చేసినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఇక తాజాగా ఆడుదాం ఆంధ్రా క్రీడలు పై కూడా సీఐడీ విచారణ ప్రారంభం కావడంతో ఎప్పుడైనా రోజాను అరెస్టు చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రోజా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా అరెస్ట్ కావడం ఖాయమని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. ఈ క్రమంలో రోజా దేశం వదిలి పారిపోవచ్చు..అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పు చేసిన వారు ఎవరైనా కూటమి ప్రభుత్వంలో తప్పించుకోలేరని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News