షిప్పింగ్ హార్బర్ ప్రమాదంపై జగన్ మానవతా దృక్పథంతో స్పందించారు: వైవీ సుబ్బారెడ్డి

విశాఖ షిప్పింగ్ హార్బర్ వద్ద జరిగిన బోటు అగ్ని ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో స్పందించారిన వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Update: 2023-11-21 08:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ షిప్పింగ్ హార్బర్ వద్ద జరిగిన బోటు అగ్ని ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో స్పందించారిన వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖలో మంగళవారం పర్యటించిన ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అగ్ని ప్ర‌మాదంపై ప్రభుత్వం..అధికార యంత్రాంగం స‌కాలంలో స్పందించడంతో హార్బర్‌లో ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పుకొచ్చారు. పోర్ట్..స్టీల్ ప్లాంట్..పోలీసులు సకాలంలో స్పందించడం అభినందనీయమన్నారు. కాస్త ఆల‌స్య‌మై ఉంటే ఆయిల్ ట్యాంకర్‌ల నుంచి ముప్పుఉండేదని అన్నారు. బోటు ఖరీదు రూ.30..50 లక్షలు అయినా అందులో 80 శాతం ప్రభుత్వం భరిస్తుంద‌ని వెల్లడించారు. పాక్షికంగా దెబ్బ తిన్న బోటు యజమానులకు కూడా ఖచ్చితంగా మేలు చేస్తామని హామీ ఇచ్చారు. పరిహారం గతం మాదిరిగా ఆలస్యం కాకుండా రోజుల వ్యవధిలో అంద‌జేస్తామ‌ని భరోసా ఇచ్చారు. మునిగిపోయిన బోట్లను తొలగించాలని పోర్ట్ అధికారులను కోరామ‌ని తెలిపారు. ఇతర బొట్లకు అడ్డం లేకుండా మునిగిన బోట్లను త్వరలో బయటకు తీస్తామ‌ని హామీ ఇచ్చారు. కేవలం పరిహారం మాత్రమే కాదు ఇతర సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామ‌ని వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ప్రమాద కారకులపై ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటుందని స్పస్టం చేశారు. సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదన్న విషయంపై విచారణ చేపట్టాలని సీపీని కోరామని... టీడీపీ హయాంలో హుద్ హుద్.. తిత్లి మాదిరిగా ఆలస్యం లేకుండా పరిహారం అందిస్తామ‌ని వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు.

Tags:    

Similar News