మహిళా కూలీకి జాక్పాట్.. ఒక్కసారిగా వజ్రం దొరకడంతో..
కూలీ పనికి వెళ్లిన ఓ మహిళకు ఏకంగా వజ్రం దొరికింది.
దిశ, వెబ్డెస్క్: కూలీ పనికి వెళ్లిన ఓ మహిళకు ఏకంగా వజ్రం దొరకడం సంచలనంగా మారింది. ఈ ఘటన కర్నూలు జిల్లా తగ్గలి మండలం జొన్నగిరిలో చోటు చేసుకుంది. మహిళకు దొరికిన వజ్రాన్ని పెరవలికి చెందిన ఓ వ్యాపారి రూ.2లక్షల నగదు, తులం బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు. అయితే దాని అసలు ధర ఎంత అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. వజ్రం దొరికిందన్న విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.