పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడె మోయాల్సి రావడం బాధాకరం : NBK

కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో చోటు చేసుకున్న విషాద ఘటనపై అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Update: 2022-12-29 07:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో చోటు చేసుకున్న విషాద ఘటనపై అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సభలో కార్యకర్తలు మృతి చెందడం తన మనసును తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలకృష్ణ ట్వీట్ చేశారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడె మోయాల్సి రావడం అత్యంత బాధాకరమన్నారు. 8 మంది మరణ వార్త 80 లక్షల కార్యకర్తల కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు.

Also Read... 

Kandukur stampede :కందుకూరు ఘటన: రోజా సంచలన డిమాండ్! 

ఒక్కో కుటుంబానికి రూ.24లక్షలు ఆర్థికసాయం: TDP

Tags:    

Similar News