AP News:మాజీ సీఎం జగన్పై బీజేపీ నేత ఫైర్.. చర్చకు సిద్ధమా అంటూ స్ట్రాంగ్ కౌంటర్?
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పుణ్యక్షేత్రం అటువంటి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు(Animal Fat) కలిసిన నెయ్యిని వినియోగించడం పై దేశవ్యాప్తంగా పలువురు మంత్రులు, అధికారులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పుణ్యక్షేత్రం అటువంటి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు(Animal Fat) కలిసిన నెయ్యిని వినియోగించడం పై దేశవ్యాప్తంగా పలువురు మంత్రులు, అధికారులు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లడ్డూ వివాదం పై తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ (Valluri Jayaprakash Narayana) స్పందించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిగిన అపచారం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు తిరుమలలో(Tirumala) జరిగిన అపచారాల పై సామాన్య బీజేపీ కార్యకర్తతో చర్చకు సిద్ధమా అంటూ వల్లూరు జయప్రకాశ్ నారాయణ సంచలన సవాల్ విసిరారు. నేడు(ఆదివారం) ఢిల్లీ(Delhi)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర పుణ్యక్షేత్రమైన(Shrine) తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను జంతువుల కొవ్వు(Animal Fat)తో అపవిత్రం చేయడమే కాక బీజేపీ పెద్దలకు తెలుసు అని మాట్లాడుతున్న జగన్ బీజేపీ నేతతో(BJP Leader) చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. సనాతన ధర్మమే ఊపిరిగా, దేశ భద్రతే ప్రాణంగా బతికేది బీజేపీ మాత్రమేనని అన్నారు. నేడు అయోధ్య, కాశీ, ఉజ్జయిని నుంచి.. ప్రపంచమంతా సనాతన ధర్మం(Sanatana Dharma) గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందుకు బీజేపీ హైందవ ధర్మం కోసం చేస్తున్న కృషే కారణమని ఆయన తెలిపారు.