ఏపీ సర్వీసులోకి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా
ఏపీ సర్వీస్లోకి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా రానున్నారు.
దిశ, వెబ్డెస్క్: ఏపీ సర్వీస్లోకి ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా రానున్నారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో సీఆర్పీఎఫ్ ఐజీగా మహేష్ చంద్ర లడ్డా పనిచేస్తున్నారు. లడ్డాను రాష్ట్ర సర్వీసులోకి పంపాలని కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. దీంతో ఐపీఎస్ లడ్డాను రాష్ట్ర సర్వీసులోకి పంపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డాకు ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టుల అనేక వివాదాల మధ్య ఉండగా.. తొలి నుంచి మహేష్ చంద్ర లడ్డాపై చంద్రబాబు పాజిటివ్గా ఉండటంతో ఈ పోస్టు ఆయనకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.