Breaking: జగన్‌కు భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ

ఏపీ మాజీ వైఎస్‌ జగన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది....

Update: 2024-08-07 06:48 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తనకు భద్రత కుదింపుపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ చేపట్టింది. దీంతో ఇరువర్గాల మధ్య వాదనలు కొనసాగాయి. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కూడా సరిగా పని చేయడం లేదని కోర్టు దృష్టికి జగన్‌ లాయర్‌ తీసుకెళ్లారు. దీంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం నిర్వహణ ఎవరిదని హైకోర్టు ప్రశ్నించింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఇంటెలిజెన్స్‌దని ప్రభుత్వం తరపున తెలిపారు. జగన్‌కు మంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం, జామర్‌ ఇవ్వొచ్చు కదా న్యాయమూర్తి అని అడిగారు. వేరే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఉందో లేదో తెలుసుకుని చెబుతామని ఈ సందర్భంగా కోర్టుకు ఏజీ తెలిపారు. 

Tags:    

Similar News