Good News:నిరుద్యోగులకు భారీ శుభవార్త..!

ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Update: 2024-08-28 06:48 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ది పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..నేడు ఏపీ కేబినెట్ భేటీ ఉదయం 11 గంటల నుంచి జరుగుతుంది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే పౌరసరఫరాల శాఖకు సంబంధించిన 2,771 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇవాళ(బుధవారం) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.


Similar News