AP News:ఆ రెండు గ్రామాలకు వెళ్లేదెలా..వర్షాలతో రాకపోకలు బంద్!​

నియోజకవర్గంలో కాజులూరు మండలంలో ఎన్‌టిఆర్​, పాలెం, అయితపూడి గ్రామాలకు రాకపోకలు బందు అయ్యాయి.

Update: 2024-09-03 12:53 GMT

దిశ ప్రతినిధి,రామచంద్రపురం:నియోజకవర్గంలో కాజులూరు మండలంలో ఎన్‌టిఆర్​, పాలెం, అయితపూడి గ్రామాలకు రాకపోకలు బందు అయ్యాయి. ఆయా గ్రామాల ముఖ ద్వారంతో పెద్ద గోతులు పడటంతో వర్షాలకు అందులో పూర్తిగా నీరు నిలిచిపోయింది. దీంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. గోతులు చాలా పెద్దగా ఉండటం వల్ల వాహనాలు ఇట్టే ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఆటోలు కూడా సైతం నిలిచిపోయాయి. ద్విచక్ర వాహనాలు కూడా రావడం లేదు. దీంతో ప్రయాణికులు ఎక్కడి వారు అక్కడే బంద్ అయ్యారు. పలు పనుల నిమిత్తం బయటకు వెళ్లే మార్గం లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, మానుకొని ఇంటికే అనేక మంది పరిమితం అయ్యారు. దీంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. రోజు వారి కూలీ చేసుకునే వారు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఆకలి బాధతో సతమతమవుతున్నారు. విషయమై అధికారులు స్పందించి ఆ రెండు గ్రామాలను కలిపే రోడ్డును తక్షణమే వేయాలని కోరుతున్నారు.


Similar News