AP News:మైనర్ బాలిక హత్య పై స్పందించిన హోంమంత్రి

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో మైనర్ బాలిక హత్యపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-07 13:06 GMT

దిశ,వెబ్‌డెస్క్: అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో మైనర్ బాలిక హత్యపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలకు గంజాయి, డ్రగ్స్ ప్రధాన కారణమని హోం మంత్రి అన్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక హత్య దురదృష్టకరం అన్నారు. పోక్సో చట్టం కింద జైలుకు వెళ్లిన వ్యక్తి..బెయిల్‌పై వచ్చి బాలికను హత్య చేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడని..తొందరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. హంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు 8 బృందాలను ఏర్పాటు చేశారు. రెండు, మూడు రోజుల్లో పట్టుకుంటాం అని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటువంటి ఘటనలలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు.


Similar News