Ap News: సీఎం చంద్రబాబు ఆందోళన.. వారిపై చర్యలకు ఆదేశం

ప్రభుత్వ పాలసీపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు....

Update: 2024-10-05 15:20 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ(Free Sand Policy)ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడే అధిక ధరలున్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు విమర్శిస్తున్నారు. ఇసుక దరఖాస్తు ఫీజు కంటే మరింత డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు(CM Chandrababu) దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టపై దుష్ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గనులశాఖ అధికారుల(Mines Department Officials)ను ఆదేశించారు. ఉద్దేకపూర్వక దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వారిని కట్టడి చేయాలని సూచించారు. ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. 


Similar News