కర్నూలు జిల్లాలో విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు మృతి

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది..

Update: 2024-10-05 16:12 GMT

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నందవరం మండలం మాచాపురంలో ఇద్దరు బాలురులు మృతి చెందారు. చెరువులో ఈతకు వెళ్లి అనిమేశ్, ఉదయ్ కుమార్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. దసరా సెలవులు రావడంతో ఇద్దరు బాలురులు సరదాగా ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో దిగి ఈత కొడుతుండగా అనిమేశ్ గల్లంతయ్యారు. అయితే ఉదయ్ కుమార్ కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఊపిరాడక కొద్దిసేపటికే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.


Similar News