విద్యుత్ సబ్ స్టేషన్లపై దాడికి దిగిన వైసీపీ నేతలు

కర్నూల్ జిల్లాలో వైసీపీ నాయకుల ప్రధాన అనుచరులు మరోసారి రెచ్చిపోయారు.

Update: 2024-10-03 09:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : కర్నూల్ జిల్లాలో వైసీపీ నాయకుల ప్రధాన అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. స్థానిక ఎమ్మెల్యే విరూపాక్ష సోదరుడు, ఆయన అనుచరులతో కలిసి స్థానిక విద్యుత్ స్టేషన్లపై దాడికి దిగారు. ఆలూరు మండలంలోని మొలిగివలి, ఆస్పరి మండలంలోని జోహారపురంలోని సబ్ స్టేషన్లపై దాడి చేసి, అడ్డు వచ్చిన అధికారులను చితకబాదారు. కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకు ఎదురు సమాధానాలు చెప్తే ప్రాణాలు తీస్తామంటూ అధికారులను, సిబ్బందిని బెదిరించారు. కాగా దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.   


Similar News