Home Minister Anitha: మాకు నీతులు చెప్పే స్థాయి నీకు లేదు.. జగన్‌పై హోంమంత్రి అనిత ఫైర్

గుంటూరు (Guntur) జీజీహెచ్‌ (GGH)లో బ్రెయిన్ డెడ్ (Brain Dead) అయిన సహానా కుటుంబ సభ్యులను ఇవాళ ఆయన పరామర్శించారు.

Update: 2024-10-23 15:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు (Guntur) జీజీహెచ్‌ (GGH)లో బ్రెయిన్ డెడ్ (Brain Dead) అయిన సహానా కుటుంబ సభ్యులను ఇవాళ ఆయన పరామర్శించారు. అనంతరం జగన్ (Jagan) మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. కేబినేట్ భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆస్తుల్లో వాటా కోసం తోడబుట్టిన చెల్లి వైఎస్ షర్మిల (YS Sharmila), జన్మనిచ్చిన తల్లి వైఎస్ విజయమ్మ (Vijayamma)పై జగన్ (Jagan), భారతి (Bharathi)లు కోర్టు మెట్లు ఎక్కడం సిగ్గుచేటని అన్నారు. అలాంటి వారికి తమకు నీతులు చెప్పే స్థాయి లేదని వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఫైర్ అయ్యారు.

వారంలో మూడు రోజులు మాత్రమే రాష్ట్రంలో ఉంటూ.. జగన్ (Jagan) టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో వేలల్లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని గుర్తు చేశారు. ఆ విషయాలను రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ మరిచిపోలేదని కౌంటర్ ఇచ్చారు. టైం పాస్ రాజకీయాల కోసం రాష్ట్రానికి వచ్చి తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హోంమంత్రి అనిత (Home Minister Anitha) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


Similar News