CM Chandrababu: వెంకయ్యనాయుడు మనవడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు

భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

Update: 2024-10-23 16:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి (Venkaiah Naidu) మనుమడి నిశ్చితార్థ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హాజరయ్యారు. గుంటూరు (Guntur) పట్టణంలోని శ్రీ ఫంక్షన్ హాల్‌లో వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) మనుమడు విష్ణు - సాయి సాత్విక నిశ్చితార్థ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, జాతీయ నేతలు కూడా హాజరయ్యారు. ఈ మేరకు నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను వెంకయ్యనాయుడు ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై వారు కాసేపు ముచ్చటించారు. సీఎం వెంట జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ (MLA Konathala Ramakrishna) ఉన్నారు.


Similar News