CM Chandrababu: వెంకయ్యనాయుడు మనవడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు
భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
దిశ, వెబ్డెస్క్: భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి (Venkaiah Naidu) మనుమడి నిశ్చితార్థ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హాజరయ్యారు. గుంటూరు (Guntur) పట్టణంలోని శ్రీ ఫంక్షన్ హాల్లో వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) మనుమడు విష్ణు - సాయి సాత్విక నిశ్చితార్థ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, జాతీయ నేతలు కూడా హాజరయ్యారు. ఈ మేరకు నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను వెంకయ్యనాయుడు ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై వారు కాసేపు ముచ్చటించారు. సీఎం వెంట జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ (MLA Konathala Ramakrishna) ఉన్నారు.