లిస్ట్ ఇదిగో! అరెస్ట్ ఎప్పుడు?: మద్యం తయారీదారులపై జగన్‌కు పురంధేశ్వరి సవాల్

ఏపీలో మద్యం తయారు చేసే డిస్లరీస్ యాజమాన్య వివరాలు ప్రకటించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

Update: 2023-10-25 09:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో మద్యం తయారు చేసే డిస్లరీస్ యాజమాన్య వివరాలు ప్రకటించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. బీజేపీ పక్షాన ప్రభుత్వానికి సవాల్ చేసినా.. నేటి వరకు ఆ వివరాలును చెప్పలేక పోయారు అని అన్నారు. కంపెనీల వెనుక ఉన్న యాజమాన్యాల వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు అని పురంధేశ్వరి ప్రశ్నించారు. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పోరేషన్‌లో వందకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో 16 కంపెనీల ద్వారానే 74 శాతం మద్యం సేకరణ జరుగుతుంది అని తెలిపారు. 100 కంపెనీలు ఉంటే.. 16 కంపెనీలకే ఎందుకు ప్రాధాన్యాత ఇస్తున్నారు అని పురంధేశ్వరి ప్రశ్నించారు. ‘2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు మద్యం పాలసీని మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే మద్యం షాపుల నిర్వహణ మొదలు పెట్టారు. రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో నడుస్తున్నాయి. అదాన్ డిస్టలరీస్ 2019లో హైదరాబాద్ సాగర్ సొసైటీ ప్లాట్ నెంబర్ 16 నుంచిలో ప్రారంభించారు. ఈ అదాన్ కంపెనీకి రూ.1,160కోట్ల కేటాయింపు జరిగింది. చింతకాయల రాజేశ్, పుట్టా మహేశ్ కంపెనీల నుంచి కంపెనీలు లీజ్ కు తీసుకుని నడుపుతున్నారు. వీరిని బెదిరించి.. అదాన్ డిస్లరీస్ కంపెనీ సబ్ లీజ్‌కు తీసుకున్నారు. వారి నుంచి బలవంతంగా లాక్కుని బ్రాండ్‌లను తయారు చేస్తున్నారు’ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.

ఆదాన్ వెనుక విజయసాయిరెడ్డి

ఇకపోతే ఆదాన్ డిస్లరీస్ వెనుక వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. రూ.1863కోట్ల మద్యం ఈ డిస్లరీస్ నుంచి సేకరణ జరుగుతుంది అని ఆరోపించారరు. ‘చంద్రబాబు అన్నింటికీ అనుమతి ఇచ్చారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఎస్పీవై వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే మార్కెట్లోకి వచ్చింది. ఎస్పీ వై ఛాంపియన్, గోల్డ్ పేరుతో అనేక మద్యం ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు. ఆదాన్ వెనుక ఎంపీ విజయసాయిరెడ్డి, ఎస్పీవై వెనుక ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు’ అని దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. ఆదాన్, ఎస్పీ వై సంస్థల అడ్రస్ రెండూ హైదరాబాద్ ఒకే చిరునామా. ఎంయస్ బయెటెక్ సంస్థ తరపున అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి సబ్ లీజుకు తీసుకుని మద్యం సరఫరా చేస్తున్నారు. మాన్షన్ హౌస్, మంజీరా క్లాసిక్, అథెంటిక్, రెరెస్ట్ స్పిరట్ బ్రాందీ తయారు చేస్తున్నారు అని దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. యన్.కె. డిస్లరీస్ తరపున రూ.1966.66కోట్ల మద్యం సరఫరా చేశారు అని పురంధేశ్వరి ఆరోపించారు. గతంలో ఎప్పుడూ వీళ్లు తయారు చేసిన కంపెనీల పేర్లే మార్కెట్‌లో లేవని చెబుతున్నారు.ప్రకాశంజిల్లాలో పాల్ డిస్లరీస్‌కు రూ.931.32కోట్ల మద్యానికి ఆర్డర్ ఇచ్చారు. సీఎం అనుచరులు బెదిరించి.. ఈ కంపెనీ లాక్కుని నడుపుతున్నారు. బి.ఆర్.కె స్పిరిట్స్ రూ.1040 కోట్ల మద్యం సేకరణ జరిగింది. శర్వాణి బేవరేజెస్ ను చంద్రారెడ్డి నడుపుతుండగా రూ.426.60 కోట్ల మద్యం ఆర్డర్ ఇచ్చారు. బిడి.యస్.హెచ్ ఆగ్రో కు రూ.328 కోట్ల మద్యం ఆర్డర్ ఇచ్చారు. ఈ కంపెనీల పేర్లు, యజమానుల పేర్లు చెప్పాలని కోరినా ప్రభుత్వం స్పందించ లేదు అని దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తమ బాధ్యతగా మద్యం తయారీదారులు, వారి వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు తామే ప్రజలకు తెలియజేస్తున్నాం అని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు గాల్లోకి

మద్యం తయారు చేసినా, విక్రయించినా కఠినంగా శిక్షిస్తామని ఎన్నికల ప్రచారం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గబాటి పురంధేశ్వరి తెలిపారు. తాము ఇప్పుడు మద్యం తయారీదారుల వివరాలు ప్రకటించామని.. మరి ఇప్పుడు ఈ తయారీదారులను ఎప్పుడు అరెస్టు చేస్తారు అని దగ్గుబాటి పురంధేశ్వరి నిలదీశారు. దశల వారీగా మద్యం నిషేధిస్తామన్న జగన్.. వారి అనుయాయులతో మద్యం తయారు చేసి పేదల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అని మండిపడ్డారు. కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు 39 మంది మద్యం వల్లే ఆస్పత్రిలో ఉన్నారని తేలిందన్నారు. ఏపీలో అటువంటి పరిస్థితి లేదని వైసీపీ నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. మరి వైద్యులు చెబుతున్న అంశాలపై ప్రభుత్వం స్పందించదా అని దగ్గబాటి పురంధేశ్వరి నిలదీశారు. రూ. 56వేల కోట్ల ఆదాయం మీకు వస్తుంటే రూ.20వేల కోట్ల ఆదాయం ప్రభుత్వం చెబుతుంది అని ఆరోపించారు. మరి లెక్కల్లోకి రాని ఆదాయం ఎక్కడకు వెళుతుందో జగన్ చెప్పాలి అని దగ్గుబాటి పురంధేశ్వరి నిలదీశారు. ఫైవ్ స్టార్ హోటల్స్‌కే మద్యం పరిమితం చేస్తానని చెప్పిన జగన్ కానీ అప్పు కోసం మద్యపాన నిషేధం ఉండదని...మార్పులు ఉండవని అగ్రిమెంట్‌లో జగన్ సంతకం చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. వీటిపై అడిగితే కనీసం సమాధానం చెప్పే ధైర్యం కూడా వైసీపీ ప్రభుత్వానికి లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు.

ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఎందుకు కనిపించవు?

ఇకపోతే మద్యం షాపులో కేవలం నగదు ఇస్తేనే అమ్మకాలు చేస్తున్నారు అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. వశిష్ట అనే కంపెనీకి ఏపీ ఆన్ లైన్ విధానంలో డబ్బులు కట్టించుకున్నట్లు వెల్లడించారు. కానీ అవేమీ పని చేయవు.. క్యాష్ అండ్ క్యారీ మాత్రమే అమలు చేస్తున్నారని మండిపడ్డారు. టీ,భజ్జీ కొట్టుకు వెళ్లినా నేడు ఫోన్ పే ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. బెల్టు షాపులకు అయితే హద్దే లేదు.. బడ్డీ కొట్లలో కూడా బహిరంగంగా అమ్ముతున్నారు. మద్యం దుకాణాల్లో ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఎందుకు కనిపించవు? మద్యం అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్ర మంత్రిని కోరాం అని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు.

అప్పులపై అసత్య ప్రచారం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఫిర్యాదు చేసినట్లు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ఆధారంగా ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని వివరించారు. కార్పోరేషన్లు, రాష్ట్ర ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తెచ్చారు అని మండిపడ్డారు. ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సీరియల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, ఐటీ, ఈడీ ద్వారా మద్యం కుంభకోణాలపై విచారణ చేపట్టాలని వినతిపత్రం ఇచ్చినట్లు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు.

Tags:    

Similar News