వృద్ధురాలి హత్య కేసు.. నందిగం సురేశ్‌కు భారీ ఎదురుదెబ్బ

వెలగపూడి వృద్ధురాలి హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు కోర్టు రిమాండ్ విధించింది...

Update: 2024-10-07 09:15 GMT

దిశ, వెబ్ డెస్క్: వెలగపూడి వృద్ధురాలి హత్య కేసు(Old Woman Murder Case)లో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌(Former YCP MP Nandigam Suresh)కు మంగళగిరి కోర్టు(Mangalagiri Court) 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం(Telugu Desam Party Office)పై దాడి కేసులో సెప్టెంబర్ 5న ఆయనను పోలీసులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సురేశ్ గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

అయితే 2020లో తుళ్ళూరు మండలం వెలగపూడిలో వృద్ధురాలి హత్య జరిగింది. ఈ హత్య కేసులో తుళ్లూరు పోలీసులు గత నెలలో పీటీ వారెంట్ వేశారు. ఈ వారెంట్‌ను మంగళగిరి కోర్టు అనుమతించింది. దీంతో నందిగం సురేశ్‌ను సోమవారం కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం  సురేశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. 


Similar News