శ్రీసత్యసాయి జిల్లా ఘటనపై సీఎం సీరియస్.. ఎస్పీకి కీలక ఆదేశాలు

సత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ......

Update: 2024-10-12 09:35 GMT

దిశ, వెబ్ డెస్క్: సత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దర్యాప్తు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అత్తా కోడలిపై అత్యాచారం చేసిన ఐదుగురు దుండగులు

కాగా సత్య సాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్‍మెన్‌గా ఉంటున్న అత్తా కోడలిపై గుర్తు తెలియని దుండగులు లైంగిక దాడి చేశారు. రాత్రి సమయంలో బయట సౌండ్ రావడంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి టార్చ్ లైట్ వేసి చేశారు. అయితే ఐదుగురు దుండగులు కనిపించారు. దీంతో ఇక్కడ ఎందుకు ఉన్నారని అడగడంతో దాడికి దిగారు. లోపల ఉన్న గదిలోకి నలుగురు వ్యక్తులు చొరబడి ఇద్దరి మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. వెంటనే అక్కడి నుంచి దుండగులు పరారీ అయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 


Similar News