Ap News: త్వరలో ఎన్నికలు.. వైసీపీ అభ్యర్థిగా గౌతంరెడ్డి ఖ‌రారు

ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ జగన్ వైసీపీ అభ్యర్థిని ఖరారు చేశారు..

Update: 2024-09-30 12:05 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు(Mlc Elections)  జరగనున్నాయి. కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చిలోనే ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తులు చేస్తోంది. ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) దూకుడు పెంచింది. ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటాలని భావిస్తోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన విధంగా ఈ రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కీలక నేతలను రంగంలోకి దింపుతోంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించిన అధిష్టానం.. వైసీపీ అభ్యర్థిని ఫైనల్ చేసింది. వైసీపీ నేత, సీనియర్ నాయకుడు పొన్నూరు గౌతంరెడ్డి(Ycp Leader Ponnuru Gautham Reddy) పేరును ఖరారు చేసింది. ఈ మేరకు గౌతంరెడ్డి అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధిష్టానం ప్రకటించింది.


Similar News