Chandrababu Naidu: గుడ్లవల్లేరు ఘటన.. మహిళా SI పై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్

గుడ్లవల్లేరు కాలేజీలో లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాల ఘటన పై విద్యార్థినిలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది.

Update: 2024-09-01 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుడ్లవల్లేరు కాలేజీలో లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాల ఘటన పై విద్యార్థినిలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ కాలేజ్ ఘటనలో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి సీరియస్‌ అయ్యారు. అందులో భాగంగా ఎస్ఐ శిరీష తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బందోబస్తు విధుల కోసం వచ్చిన ఆమెను అధికారులు విఆర్‌కు పంపారు.

కోడూరు‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న శిరీష….విద్యార్ధినులతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్సై తీరుపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కాగా రాత్రి నుంచి మీతో తిండి లేక ఉంటున్నామని.. విద్యార్థులను ఎస్ఐ శిరీష బెదిరించారు. ఆ వీడియో వైరల్ కావడంతో… గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో మహిళా ఎస్ఐ తీరుపై సీఎం ఫైర్ అయ్యారు. బాధలో, ఆందోళనలో ఉన్న విద్యార్ధినులతో దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని వారి బాధను అర్థం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు.


Similar News