22 గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు

పాలకొల్లు మండలం 22 గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ.3.20 కోట్లు మంజూరయ్యాయి అని ఈ క్రమంలో పనులు చేపట్టనున్నట్లు ఎంపీడీవో ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపారు.

Update: 2024-10-19 11:42 GMT

దిశ, పాలకొల్లు: పాలకొల్లు మండలం 22 గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ.3.20 కోట్లు మంజూరయ్యాయి అని ఈ క్రమంలో పనులు చేపట్టనున్నట్లు ఎంపీడీవో ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపారు. పాలకొల్లులో మండల పరిషత్ లోని తన ఛాంబర్‌లో శనివారం మాట్లాడారు. ఈ నిధులతో మొత్తం 40 సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రెండో విడతగా దాదాపు రెండు కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని ఈ నిధులతో 22 గ్రామాల్లోనూ సీసీ డ్రైన్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎంపీడీవో ఉమామహేశ్వరరావు వివరించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు మంత్రి నిమ్మల రామానాయుడుకు ఇప్పటికే అందజేసినట్లు తెలిపారు .


Similar News