Tirumala News:తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల పరిమితి పై కీలక నిర్ణయం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

Update: 2024-10-19 13:23 GMT

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రజెంట్ తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనానికి ఎమ్మెల్యేల నుంచి రోజుకు ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతిస్తున్నారు. దీని స్థానంలో రెండో లేఖను కూడా అనుమతించాలని సీఎం చంద్రబాబుని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు. ఈ విషయం పై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో రెండో సిఫార్సు లేఖను అనుమతించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే వారానికి ఆరు రోజులు కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్‌ దర్శనాల పరిమితిని పెంచబోతున్నట్లు వస్తున్న వార్తలతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. అయితే దీనిపై ప్రభుత్వం, టీటీడీ అధికారులు మాత్రం స్పష్టత ఇవ్వలేదు.


Similar News