టీడీపీ నేతలకు గవర్నర్ అపాయింట్మెంట్
తెలుగుదేశం పార్టీ నేతలు నేడు గవర్నర్ అబ్ధుల్ నజీర్తో భేటీ కానున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ నేతలు బుధవారం సాయంత్రం గవర్నర్ అబ్ధుల్ నజీర్తో భేటీ కానున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను గవర్నర్కు టీడీపీ నేతలు వివరించాలని భావించారు. ఈ మేరకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరగా బుధవారం సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ షరీఫ్, వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు, శాసన మండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ లు సాయంత్రం ఐదుగంటటకు విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కానున్నారు.