శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్ధుల్ నజీర్

తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు.

Update: 2023-10-22 08:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీర‌బ్ర‌హ్మం, సీవీఎస్వో న‌ర‌సింహ కిషోర్‌ సాదరంగా అహ్వానించారు. అర్చక బృందం ‘ఇస్తికఫాల్‌’ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గవర్నర్ అబ్ధుల్ నజీర్‌కు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత చైర్మ‌న్‌ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, 2024 టీటీడీ క్యాలెండర్లు డైరీలు అందజేశారు.  

Tags:    

Similar News