ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ : మంత్రి నిమ్మల రామానాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు శుభవార్త అందించింది.

Update: 2024-08-19 13:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు శుభవార్త అందించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారంటూ ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఎన్నికల్లో ప్రకటించిన అన్ని హామీలను ఒక్కొకటిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్రంలో స్కూల్ కు వెళ్తున్న ప్రతి విద్యార్థినికి రూ.15 వేలు త్వరలోనే వారి అకౌంట్లలో జమ చేస్తామని వెల్లడించారు. వీటికి సంబంధించిన అధికారులతో మాట్లాడిన నిమ్మల.. అతి త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తామని అన్నారు.  


Similar News