AP News: టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీలు

వైసీపీ మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు బుధవారం టీడీపీలో చేరారు.

Update: 2024-10-09 15:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు బుధవారం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీరు ఇరువురికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాగా వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు గత ఆగస్టులో వారి పదవులకు రాజీనామా చేశారు. అనంతరం మోపిదేవి తాను టీడీపీలో చేరతానని ప్రకటించగా.. మస్తాన్ రావు మాత్రం తన రాజకీయ భవిష్యత్తును త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. తాజాగా నేడు వీరు ఇరువురు టీడీపీలో జాయిన్ అయ్యారు.  

Tags:    

Similar News