నాకు షాకింగ్‌గా ఉంది.. పవన్ కల్యాణ్‌పై రోజా సెటైర్స్

తిరుమల లడ్డూ వివాదం, డిక్లరేషన్‌పై సంతకం, హిందూయిజం, బాప్టిజం వంటి అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా స్పందించారు

Update: 2024-09-28 03:37 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం, డిక్లరేషన్‌పై సంతకం, హిందూయిజం, బాప్టిజం వంటి అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా(Former minister Roja) స్పందించారు. తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Controversy) సందర్భంగా ఆలయాల్లో పూజలకు వైసీపీ (Ycp) పిలుపు నిచ్చిన నేపథ్యంలో మధురై మీనాక్షి టెంపుల్‌(Madurai Meenakshi Temple)లో ఆమె పూజలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై రోజా విమర్శలు కురిపించారు. చంద్రబాబు ఎప్పుడు పూజలు చేసినా కాళ్లకు షూ ఉంటాయన్నారు. దేవుడంటే ఆయనకు భయం, భక్తి లేవని ఎద్దేవా చేశారు. పవన్ భార్య క్రిస్టియన్ అని, పిల్లలు బాప్టిజం తీసుకున్నారని, ఆ విషయం స్వయంగా పవన్ కల్యాణే చెప్పారని రోజా తెలిపారు. అలాంటి వ్యక్తులు సనాతన ధర్మంపై మాట్లాడుతుంటే తనకు షాకింగ్‌గా ఉందని రోజా సెటైర్లు వేశారు. తిరుమల లడ్డూ వివాదంపై తాము సీబీఐ విచారణ కోరుతున్నామన్నారు. చంద్రబాబు గతంలో కుల రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మత రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని రోజా మండిపడ్డారు. 


Similar News