‘ఆ కన్నతల్లి గర్భశోకం మీ చెవులకు వినిపిస్తోందా?’ .. ప్రభుత్వం పై మాజీ మంత్రి రోజా ఫైర్

ఏపీలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2024-10-20 10:29 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. బద్వేల్‌లో ఉన్మాది దాడిలో యువతి చనిపోయిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వం పై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. మీడియాతో బాధితురాలి తల్లి మాట్లాడిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రమంలో రోదిస్తున్న కన్నతల్లి గర్భశోకం మీ చెవులకు వినిపిస్తోందా చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుస మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి అని ఫైరయ్యారు. కూటమి ప్రభుత్వం వరుస అత్యాచారాలు, హత్యలతో ఆంధ్రప్రదేశ్ ను 'అత్యాచారాంధ్రప్రదేశ్'గా మార్చేసిందని విమర్శించారు. ఈ మేరకు మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా స్పందించారు.


Similar News