ప్రజలు చనిపోతుంటే సీఎంకు పట్టదా: Merugu Nagarjuna

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు రాజకీయాల కోసం ఏమైనా చేస్తారని మాజీ మంత్రి మేరుగ నాగర్జున అన్నారు....

Update: 2024-10-26 11:56 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు(Cm Chandrababu) రాజకీయాల కోసం ఏమైనా చేస్తారని మాజీ మంత్రి మేరుగ నాగర్జున(Former Minister Meruga Nagarjuna) అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఆయన విమర్శలు కురిపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీల పేరిట(Electricity Charges) భారం మోపాలని చూస్తున్నారని తెలిపారు. జైలులో దోమలు కుట్టాయని గతంలో హడావుడి చేశారని, డయేరియా(Diarrhea), డెంగ్యూ(Dengue)తో ప్రజలు చనిపోతుంటే సీఎంకు పట్టదా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఓ రూల్ అని.. ప్రజలకు మరో రూలా అని మాజీ మంత్రి మేరుగ నిలదీశారు. 


Similar News