క్రిస్టియన్‌గా చెప్పుకున్న పవన్‌ను డిక్లరేషన్ అడిగే దమ్ముందా?: నారాయణస్వామి సవాల్

క్రిస్టియన్‌గా చెప్పుకున్న పవన్‌ను డిక్లరేషన్ అడిగే దమ్ముందా? అని మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత నారాయణస్వామి ప్రశ్నించారు....

Update: 2024-09-28 04:44 GMT

దిశ, వెబ్ డెస్క్: క్రిస్టియన్‌గా చెప్పుకున్న పవన్‌ను డిక్లరేషన్ అడిగే దమ్ముందా? అని మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత నారాయణస్వామి(Former Deputy CM Narayanaswamy) ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Former CM Jagan Mohan Reddy) తిరుమల డిక్లరేషన్ వివాదం(Tirumala Declaration Controversy)పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan)చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బాప్టిజం (Baptism) తీసుకున్నానని పవన్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగన్‌ను గతంలో డిక్లరేషన్ అడగలేదని, ఇప్పుడెందుకు అడుతున్నారని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇచ్చే శ్రీవారిని సోనియాగాంధీ (Sonia Gandhi) దర్శించుకున్నారా అని నిలదీశారు. పవన్ కల్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధికోసం తిరుమల శ్రీవారి పరువు తీస్తున్నారని మండపడ్డారు. కుల, మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేసిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై తాము సీబీఐ విచారణ కోరుతున్నామని నారాయణ స్వామి తెలిపారు. 


Similar News