ఇదేమి రాజ్యం చంద్రబాబు: బద్వేల్ ఘటనపై జగన్ సీరియస్

కడప జిల్లా బద్వేల్ ఘటనపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...

Update: 2024-10-20 12:27 GMT

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా బద్వేల్ ఘటన(Badwel incident)పై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పథకం ఎత్తి వేయడం వల్లే బాలికపై పెట్రోల్ దాడి(Patrol attack on girl) ఘటన జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడంతో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt)పై జగన్ మండిపడ్డారు. లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారని, ఇదేమి రాజ్యం చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేవారు. ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయన్నారు. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గమని మండిపడ్డారు. వారి కుటుంబ సభ్యులకు తాను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉందన్నారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని వైఎస్ జగన్ విమర్శించారు.


Similar News