రామోజీరావు మృతి పట్ల మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి..

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.

Update: 2024-06-08 05:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కాగా, ఆయన మృతి పట్ల ఏపీ మాజీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


Similar News