AP:గుడ్లవల్లేరు ఘటన పై ఎట్టకేలకు స్పందించిన మాజీ సీఎం జగన్
రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల బాత్రూమ్లో రహస్య కెమారాల ఘటన సంచలనంగా మారింది.
దిశ,వెబ్డెస్క్:రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల బాత్రూమ్లో రహస్య కెమారాల ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన పై విద్యార్థినులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా గుడ్లవల్లేరు ఘటనపై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటన పై వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 3 నెలల్లో విద్యావ్యస్థలన్నీ దెబ్బతిన్నాయని ఆరోపించారు. విపక్ష పార్టీ పై బురద జల్లడం కార్యక్రమాలతో పాలన గాలికొదిలేశారని అన్నారు. స్కూళ్లలో కలుషితాహారంతో వందలాది మంది అనారోగ్యం పాలవుతున్నారు. గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టినట్లుగా వస్తున్న ఆరోపణలు తీవ్రమైనవి. చంద్రబాబు ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని ట్వీట్ చేశారు.